8 April, 2026 | 11:36 PM

విజేత ఆదిల్ జోడీ

18-12-2024 12:32 AM

హైదరాబాద్: గచ్చిబౌలిలోని పుల్లెల గోపిచంద్ అకాడమీ వేదికగా జరిగిన పైప్లే పెడల్ మాస్టర్ సిరీస్ విజేతగా ఆదిల్ కాళ్యాన్పూర్ జోడీ నిలిచింది. ఈ టోర్నీకి వివిధ ప్రాంతాల నుంచి 150 మంది మాస్టర్స్ క్రీడాకారులు పాల్గొన్నారు. మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను ఆదిత్ పటేల్ పెర్నాండేస్ జోడీ కైవసం చేసుకుంది. ఫైనల్స్ అనంతరం గెలుపొందిన క్రీడాకారులకు చీఫ్ కోచ్ పుల్లెల గోపిచంద్ చేతుల మీదుగా ట్రోఫీలు అందుకున్నారు. ప్రతి ఒక్కరూ క్రీడా స్పూర్తిని పెంపొందించుకోవాలని గోపిచంద్ తెలిపారు.