21 May, 2026 | 3:21 PM

Breaking News

తెల్ల తెల్లవారుతుండగానే పల్లెల్లోకి పాఠశాలల ప్రచారం.. విత్తన కంపెనీల ప్రచార రతాలు   •   ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి ఒక్కరికి క్రీడలు అవసరం   •   ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి..   •   ఆరోగ్యం బాగుంటేనే జీవితం సార్థకం   •   ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్   •   అనుమతి లేని ప్రైవేట్, విద్యాసంస్థలను మూసివేయాలి   •   కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టెన్త్ టాపర్ కు సైకిల్ బహుకరణ...   •   జైనూర్‌లో చలివేంద్రం – అంబలి పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి   •   బాన్సువాడలో ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు...   •   ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు   •  

రిటైర్డ్ ఐఏఎస్ ఇంట్లో చోరి.. నిందితుడు అరెస్ట్

10-07-2024 02:53 PM

రంగారెడ్డి: రిటైర్డ్ ఐఏఎస్ హరిబాబు ఇంట్లో చోరీ కేసులో నిందితుడిని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. రిటైర్డ్ ఐఏఎస్ హరిబాబు నార్సింగ్ పీఎస్ పరిధిలోని గంధంగూడలో  కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ఆయన ఇంటికి తాళం వేసి కుటుంబంతో కలిసి విజయవాడ వెళ్లారు. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు పడి కిలో బంగారం, ఒక ల్యాబ్ టాప్ ను ఎత్తుకెళ్లిపోయారని బాధితుడు తెలిపాడు.

విజయవాడ నుంచి తిరిగి వచ్చిన హరిబాబు తన ఇంట్లో దొంగలు పడ్డారని గుర్తించి నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడు ప్రవీణ్ అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 85 తులాల బంగారం స్వాధీనం చేసున్నారు. ప్రవీణ్ గతంలో పలు చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.