22 July, 2026 | 3:52 PM

Breaking News

ఎస్‌ఐఆర్ కమిటీతో కేటీఆర్ సమీక్ష   •   ఐఐటీ మద్రాస్‌లో ఎం.టెక్ సీటు సాధించిన మోకాళ్ల భాను ప్రసాద్‌కు అభినందనలు   •   ప్రమాద భరితంగా మోడల్ స్కూల్ భవనం..!   •   ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి పిటిషన్ వాయిదా   •   రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ ఇల్లందులో రాస్తారోకో..   •   విద్యార్థుల స్కాలర్‌షిప్‌ కొరకు దరఖాస్తుల ఆహ్వానం.!   •   నాచారం ఎస్ఐ ఫ్రాన్సిస్‌కు సీపీ రివార్డ్   •   బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా   •   కాక్రోచ్ పార్టీ ఆందోళన ఎఫెక్ట్.. 16 ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేత   •   శాంతినగర్‌లో 'వజ్రం ప్యూర్ ఫైర్' శుద్ధ జల కేంద్రం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజర్షిషా..   •  

కలిసి తనువు చాలించారు

01-01-2026 12:09 AM

అనారోగ్య కారణాలతో.. భార్యాభర్తల ఆత్మహత్య

బచ్చన్నపేట, డిసెంబర్ 31 (విజయక్రాంతి): వివాహ సమయంలో సప్తపదిలో బతికినంతకాలం కలిసిమెలిసి ఉంటామని చేసిన ప్రతిజ్ఞ ప్రకారం ఆ దంపతులు జీవిత చరమాంకంలో కలిసే తనువు చాలించిన ఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం చిన్న రామచెర్ల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రామ్రెడ్డి, లక్ష్మి కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. చికిత్సలు చేయించుకున్నప్పటికీ ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైనట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఏమి చేయాలో తోచక అర్ధరాత్రి ఇద్దరూ కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న బచ్చన్నపేట ఎస్త్స్ర హమిద్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనారోగ్యంతో బాధపడుతున్న భార్యాభర్తలు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటనతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.