27-05-2025 01:24:08 AM
దండకారుణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్ప పేరిట మావోయిస్టుల లేఖ
నారాయణ్పూర్, మే 26: దాయాది పాకిస్థాన్ దేశం కోరితే కాల్పుల విరమణకు అం గీకరించిన కేంద్రం.. తాము చర్చలకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని మావోయిస్టు పార్టీ ఆవేదన వ్యక్తం చేసింది. ఛత్తీస్గఢ్ సరిహద్దులోని నారాయణ్పూర్ సరిహద్దుల్లో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో కేశవరావు అలియాస్ బసవరాజు సహా 28 మంది మావో యిస్టులు చనిపోయినట్టు ఆ వర్గాలు వెల్లడించాయి.
ఈ మేరకు దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ ప్రతినిధి వికల్ప పేరిట మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ఈ ఎన్ కౌంటర్లో 27 మంది మృతిచెందినట్టు ప్రభుత్వం వెల్లడించిందని.. అయితే, మరో మృతదేహాన్ని తాము తీసుకెళ్లినట్టు లేఖలో పేర్కొన్నారు. కేశవరావు టీమ్లో ఉన్న ఆరుగురు మావోయిస్టులు ఇటీవల పోలీసులకు లొంగిపోయారని, వాళ్లిచ్చిన సమాచారంతోనే ఈ దారుణం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
యూనిఫైడ్ కమాండో సభ్యుడొకరు సైతం ద్రోహిగా మారినట్టు లేఖలో పే ర్కొన్నారు. ఎన్కౌంటర్ ముందురోజు నుంచి 20 వేల మంది బలగాలు తామున్న ప్రాంతా న్ని చుట్టుముట్టి.. 10 గంటల్లో ఐదు ఎన్కౌంటర్లు చేశాయని మావోయిస్టులు లేఖలో తెలి పారు. 60 గంటల పాటు బలగాలు తమను నిర్బంధించాయని చెప్పారు.
అప్పటికే కేశవరావును సురక్షిత ప్రాంతానికి తరలించేందు కు యత్నించగా.. తమను వదిలి వెళ్లేందుకు ఆయన ఇష్టపడలేదన్నారు. నాయకత్వాన్ని ముందుండి నడిపించాలని తమతోనే ఉన్న కేశవరావు కోసం 35 మంది ప్రాణాలు అడ్డుపెడితే.. ఏడుగురం సురక్షితంగా బయటప డ్డామని, మిగిలిన వారంతా ఎన్కౌంటర్లో మరణించారని తెలిపారు.