30-05-2025 12:00:00 AM
ఇప్పల్ నవెగాం ప్రజలకు బీజేపీ నేత నాగేశ్వరరావు భరోసా
కుమ్రం భీం ఆసిఫాబాద్, మే29(విజ యక్రాంతి): ఆసిఫాబాద్ మండలంలోని ఇప్పల్ ననేగాం గ్రామ ప్రజలను బెదిరింపులకు గురిచేస్తున్న వారిపై చర్యలు తీసుకో వాలని బీజేపీ నేత అరిగెల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.ఇటీవల కొంతమంది ఆ గ్రామ ప్రజలను ఊరు కాళీ చేసి వెళ్లిపోవాలని బెదిరింపులకు దిగడంతో గురువారం అరిగెల నాయకులతో కలిసి గ్రామాన్ని సం దర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ వందల ఏండ్ల నుంచి ఇక్కడ నివసిస్తున్న ప్రజలను కొంతమంది పట్టాదారు లు వచ్చి గ్రామాన్ని ఖాళీ చేయాలని దౌర్జ న్యం చేస్తున్నారని ప్రజల పక్షాన పోరాటం చేస్తామన్నారు.
ఎవరు వచ్చి భయభ్రాంతులకు గురిచేసిన భయపడవద్దని గ్రామ ప్రజ లకు ధైర్యం నింపారు. గ్రామాన్ని ఖాళీ చేసే ప్రసక్తే లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు సుంకరి పెంట య్య, సింగిల్ విండో వైస్ చైర్మన్ ప్రహ్లాద్, నాయకులు సంతోష్, శ్రీకాంత్ ఉన్నారు.