calender_icon.png 30 July, 2025 | 8:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి కేసులో ముగ్గురు నిందితులు రిమాండ్

29-07-2025 08:46:58 PM

నిందితుల వద్ద నుండి సుమారు (30 వేల విలువ గల) 1.21 కేజీల గంజాయి రెండు సెల్ ఫోన్లు స్వాధీనం..

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): గంజాయి కేసులో ముగ్గురు నిందితులు రిమాండ్ చేసి నిందితుల వద్ద నుండి సుమారు (30 వేల విలువ గల) 1.21 కేజీల గంజాయి రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఏమి రెడ్డి రాజశేఖర్ రెడ్డి(Inspector Amireddy Rajasekhar Reddy) తెలిపారు. మంగళవారం పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నిందితులు తల్లమల్ల శివ శంకర్, భక్తుల శబరి గిరీష్ లు రాజస్థాన్లోని వివేకనంద గ్లోబల్ యూనివర్సిటీ నందు అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తి చేశారు. అదే సమయంలో ఇద్దరు గంజాయికి అలవాటుపడ్డారు. నిందితుడు తల్లమల్ల శివ శంకర్, యాస భాను ప్రకాశ్ రెడ్డి లు ఇంటర్మీడియట్ నుండి స్నేహితులు. నిందితుడు శివశంకర్ తనకి గంజాయి అవసరం ఉన్నప్పుడల్లా అతని స్నేహితులైన శబరి గిరీష్, భాను ప్రకాష్ నుండి తీసుకొని వాడుకునేవాడు. శబరి గిరీష్ హైదరాబాద్ లోని ఫహత్ నగర్ నుండి గంజాయి తెచ్చుకునేవాడు.

ఇతను  గత సంవత్సరం 2024 లో  గంజాయి కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు. అయినా కూడా అతని ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. నిందితుడు శివశంకర్ నల్గొండ పట్టణంలో గంజాయి అలవాటు ఉన్నవారు చాలామంది ఉన్నార ని వారికి గంజాయిని అమ్మి ఎక్కువ మొత్తంలో సొమ్ము చేసుకోవచ్చని దురుద్దేశంతో, వారం రోజుల క్రితం ముగ్గురు నిందితులు కలిసి పాత్ నగర్ లోని  1.5 కేజీల గంజాయిని కొనుగోలు చేసి నల్గొండకు తీసుకొని వచ్చారు. అందులో కొంత భాగాన్ని చిన్న చిన్న పాకెట్లుగా చేసి నల్గొండ పట్టణంలోని అవసరం ఉన్న కొంతమంది వ్యక్తులకు పాకెట్ ఎనిమిది వందల రూపాయలు చొప్పున అమ్ముతున్నారు.    గంజాయిని ముగ్గురు వ్యక్తులు సమంగా పంచుకొని నల్గొండ పట్టణంలో అమ్మడానికి వెళ్దామని చూస్తుండగా  నమ్మదగిన సమాచారం మేరకు సోమవారం పోలీసులు నిందితులను పట్టుకొని    వారి వద్దనుండి 1.21 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారుఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుబడు చేసిన నల్గొండ వన్ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి ఎస్ఐ సైదులు,గోపాల్ రావు సిబ్బంది షకిల్, సత్యనారాయణ, లింగస్వామి, సైదులు, అఖిల్ లను నల్గొండ జిల్లా ఎస్. పి శరత్ చంద్ర పవార్  అభినందించారు.