15 June, 2026 | 1:57 PM

Breaking News

ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •   ఆలయంలో గుప్తనిధుల వేట.. ప్రాచీన శివాలయం ధ్వంసం   •   భట్టి విక్రమార్కకు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ   •  

ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ముగ్గురు మృతి

28-12-2025 10:49 AM

హైదరాబాద్: సంగారెడ్డి జిల్లాలో ఘోరా రోడ్డు ప్రమాదం జరిగింది. నారాయణఖేడ్ శివారులో నిజాంపేట్-బీదర్ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ఎన్‌హెచ్-161బి జాతీయ రహదారిపై నిజాంపేట మండల కేంద్రం సమీపంలో కల్వర్టు గుంతలో బైక్ అదుపు తప్పి పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు మరణించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం నారాయణఖేడ్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు ఆవుటి నరసింహులు (27), జిన్న మల్లేష్ (24), జిన్న మహేష్ (23)గా గుర్తించారు. ముగ్గురూ దగ్గరి బంధువులే అని, ఆ ప్రదేశంలో సరైన లైటింగ్, హెచ్చరిక సూచిక బోర్డులు లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.