17 April, 2026 | 2:06 PM

Breaking News

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •   ఉద్యోగుల ప్రధాన సమస్యలపై నిరసన ప్రదర్శన   •   కామారెడ్డి జిల్లాలో ఏసీబీ సోదాలు.. అస్వస్థతకు గురైన ఎక్సైజ్ సీఐ   •  

భీమేశ్వర స్వామి ఆలయంలో నిరంతర దర్శనాలు

28-12-2025 11:05 AM

ఆలయ ఈఓ రమాదేవి

వేములవాడ,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంకు అనుబంధమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సమ్మక్క–సారలమ్మ జాతర నేపథ్యంలో భక్తుల రాక పెరిగే అవకాశముందని ఆలయ యాజమాన్యం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. ఈ క్రమంలో 28-12-2025, 04-01-2026, 11-01-2026, 18-01-2026 (ఆదివారాలు) తేదీల్లో ఆలయాన్ని 24 గంటలు తెరిచి ఉంచి నిరంతర దర్శనాలు కల్పించనున్నట్లు ఆలయ ఈఓ ఎల్. రమాదేవి తెలిపారు.భక్తుల సౌకర్యార్థం దర్శనాలు, పూజా కార్యక్రమాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని పేర్కొంటూ, సమ్మక్క–సారలమ్మ జాతరకు వెళ్లే భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఈఓ రమాదేవి విజ్ఞప్తి చేశారు.