17 April, 2026 | 3:10 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

రేపే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. జలాల సమస్యలే అజెండా

28-12-2025 12:02 PM

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ప్రసుత్తం నదీ జలాల సమస్యలపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతున్న నేపథ్యంలో శాసనసభ సమావేశాలు వాడీవేడిగా సాగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు తెలుపుతున్నాయి.  బీఆర్ఎస్ ఇటీవల తెలంగాణ జల హక్కులను పరిరక్షించడానికి ఆందోళనను ప్రకటించింది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీకి అసెంబ్లీలో చర్చకు సవాలు విసరడంతో నీటి సమస్యలు ఈ శీతాకాల సమావేశం అజెండాలో ప్రధాన అంశాలుగా ఉండే అవకాశం ఉంది.

గత రెండేళ్లుగా బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉన్న బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఇటీవల తెలంగాణ భవన్లో ప్రారంభమైన బీఆర్ఎస్ ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం ఆయన హాజరయ్యారు. సమావేశం అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ... పాలమూరు-రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించిన వివరణాత్మక ప్రాజెక్టు నివేదికను కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపినప్పటికీ, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవడంలో విఫలమైందన్నారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కాంగ్రెస్ పాలనను పనికిమాలినదని అభివర్ణించారు.