24 June, 2026 | 2:35 PM

Breaking News

రాష్ట్రవ్యాప్తంగా వినిపించే ఒకే మాట.. 'కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ కావాలి'   •   'అలావా-ఎ-బీబీ', 'అజాఖానా జహ్రా', 'అలావా-ఎ-సర్తౌక్'లను సందర్శించిన 9వ నిజాం నవాబ్   •   తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •   ప్రజల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన   •   నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •  

ఆవు మృతి.. రైతుకు తీరని నష్టం

28-12-2025 11:08 AM

ప్రభుత్వం ఆదుకోవాలి : సర్పంచ్ ఆకుల స్వప్న హరీష్

సిద్దిపేట రూరల్: నారాయణరావుపేట మండల పరిధిలోని గుర్రాలగొంది గ్రామానికి చెందిన యువ రైతు పిట్ల శేఖర్‌కు చెందిన లక్ష రూపాయల విలువైన ఆవు ఆదివారం తెల్లవారుజామున అనుమానాస్పదంగా మృతి చెందింది. ఈ ఘటనతో రైతు తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నాడని గ్రామ సర్పంచ్ ఆకుల స్వప్న హరీష్ తెలిపారు. బాధిత రైతును ప్రభుత్వం వెంటనే ఆదుకొని తగిన పరిహారం అందించాలని కోరారు. సంబంధిత అధికారులు స్పందించి రైతుకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.