calender_icon.png 28 June, 2025 | 5:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కౌన్సెలింగ్‌కు వేళాయె..

28-06-2025 01:46:03 AM

-నేటి నుంచి టీజీ ఎప్‌సెట్ రిజిస్ట్రేషన్లు షురూ 

-  జూలై 1 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 

-ఈసారి మాక్ సీట్ అలాట్‌మెంట్ 

- 15న తొలివిడత సీట్ల కేటాయింపు 

-పాత ఫీజుల ప్రకారమే కౌన్సెలింగ్

హైదరాబాద్, జూన్ 27 (విజయక్రాం తి): తెలంగాణ ఉన్నత విద్యామండలి శుక్రవారం టీజీ ఎప్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేసింది. హైదరాబాద్‌లోని మం డలి కార్యాలయంలో చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ఎప్‌సెట్ కన్వీనర్ శ్రీదేవసేన తొలుత అడ్మిషన్ కమిటీ సమావేశం నిర్వహించి, ఆ తర్వాత ఫలితాలు విడుదల చేశారు. పాత ఫీజుల ప్రకారమే కౌన్సెలింగ్ ఉం టుందని స్పష్టం చేశారు.

మూడు దశల్లో సీట్ల భర్తీ ఉంటుందన్నారు. శనివారం నుం చే మొదటి విడత కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందున్నారు. రాష్ట్రంలో తొలిసారిగా మాక్ సీట్ల కేటాయింపు ప్రక్రియ చేపడుతున్నామని స్పష్టం చేశారు.

తొలి దశ కౌన్సెలింగ్ షెడ్యూల్

శనివారం నుంచి జూలై 7 వరకు రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్స్ జరు గుతాయి.  జూలై 1 నుంచి 8 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతుంది.  జూలై 6 నుంచి 10 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు, జూలై 10న ఫ్రీజింగ్ ఆప్షన్స్, జూలై 13 లే దా అంతకంటే ముందు రోజు మాక్ సీట్ అలాట్‌మెంట్ ఉంటుంది. జూలై 18న మొదటి విడుత సీట్ల కేటాయింపు జరుగుతుంది. అలాగే జూలై 18 నుంచి 22 వరకు ట్యూషన్ ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఆలోపు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

జూలై 25 నుంచి రెండో విడత

రెండో విడత కౌన్సెలింగ్ జూలై 25 నుంచి జరుగనున్నది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ (ఫస్ట్ ఫేజ్‌లో నమోదు చేసుకో ని వారికి మాత్రమే)కు జూలై 25న అవకాశం ఉంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు జూలై 26న, వెబ్ ఆప్షన్ల నమోదుకు జూలై 26, 27వ తేదీ ల్లో అవకాశం ఉంది. రెండో విడత సీట్ల కేటాయింపు జూలై 30న ఉంటుంది. సీటు పొం దిన అభ్యర్థులు ట్యూషన్ ఫీజు చెల్లించేందుకు, సెల్ఫ్ రిపోర్టింగ్‌కు జూలై 30 నుంచి ఆగస్ట్ 1 వరకు గడువు ఉంది. నేరుగా కాలేజీలకు వెళ్లి చేరేందుకు మాత్రం జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు అవకాశం ఉంది. 

ఆగస్టు 5 నుంచి మూడో విడత

మూడో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ఆగస్టు 5వ తేదీ నుంచి షురూ కానున్నది. 10న మూ డో విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. అభ్యర్థులు ఇదే నెల 10  వరకు ట్యూషన్ ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. 11 నుంచి 13 వరకు బ్రాంచ్/ కాలేజీ మార్పు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఇంటర్నల్ స్లుడింగ్‌కు ఆగస్టు 18 వరకు గడువు ఉంది.

అలాగే ఈనెల 30 వరకు కాలేజీల అఫిలియేషన్లు, సీట్ల అనుమతులకు సంబంధించిన గడువు  ఉంది. ఈక్రమంలోనే కొన్ని కాలేజీల్లోని మౌలిక వసతులపై జేఎన్టీయూ నోటీసు లు ఇచ్చి వివరణ కోరింది. ఆ తర్వాత అఫిలియేషన్ ప్రక్రియ పూర్తి కానున్నది.

ఈసారి కౌన్సిలింగ్‌లో మార్పులు..

- ఉన్నత విద్యామండలి ఈసారి కౌన్సెలింగ్ లో మాక్‌సీట్ అలాట్‌మెంట్ అమలు చే యనున్నది. అది నిజమైన సీట్ అలాట్‌మెంట్ కాదని, అభ్యర్థుల అవగాహన కోస మేనని మండలి స్పష్టం చేసింది. మాక్ సీట్ కేటాయింపుల్లో ఏవైనా తప్పులు దొర్లినట్లు అభ్యర్థులు గుర్తించినా, లేదా కేటాయించిన సీటు నచ్చకపోయినా, అభ్యర్థి తిరిగి ఆప్షన్లు ఇచ్చేందుకు అవకాశం ఉంది. లేదంటే ముందు కేటాయించిన సీటుకు మళ్లీ ఆప్షన్ ఇచ్చే అవకాశమూ ఉంటుంది.

- రెండో విడత కౌన్సెలింగ్ తర్వాత సీటు పొ ందిన కాలేజీల్లో అభ్యర్థులు రిపోర్ట్ చేస్తేనే, వారికి తుది విడుత కౌన్సెలింగ్‌తో పాటు ఇంటర్నల్ స్లుడింగ్‌కి అవకాశం ఉంటుంది.

- ఫైనల్ ఫేజ్ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రాపౌట్లు/రద్దుకు అవకాశం ఉండదు.

- ఫైనల్ ఫేజ్ తర్వాత మిగిలిన సీట్లకు ఇంటర్నల్ స్లుడింగ్ ప్రక్రియ ద్వారా కన్వీనరే సీట్లు భర్తీ చేస్తారు. ఇంటర్నల్స్లు డింగ్ ద్వారా బ్రాంచ్ మార్చుకునే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తిస్తుంది.

- ఇంటర్నల్ స్లుడింగ్ తర్వాత డ్రాపౌట్లు/రద్దు ఉంటే స్పాట్ అడ్మిషన్స్‌లో భర్తీకి అవకాశం ఉండదు.

- లాటరల్ ఎంట్రీ ద్వారా రెండో సంవత్సరంలో జాయిన్ అయ్యే ఈసెట్ విద్యార్థుల కూ సీట్ ఇవ్వొచ్చు.

- ఇంటర్నల్ స్లుడింగ్ తర్వాత.. సీట్లు ఉంటే (భర్తీ కానివి, స్లుడింగ్ వల్ల ఖాళీ అయినవి) స్పాట్ అడ్మిషన్స్ ద్వారా భర్తీ చేస్తారు.