calender_icon.png 5 July, 2025 | 11:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం

10-06-2025 08:53:24 AM

తిరుమల తిరుపతి దేవస్థానంలో(Tirumala Tirupati Devasthanam) భక్తుల రద్దీ కొనసాగుతుంది. తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి(Srivari Sarva Darshan) 18 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులతో అన్ని కంపార్టుమెంట్లన్నీ నింది క్యూలైన్ వరకు భక్తులు వేచిఉన్నారు. నిన్న శ్రీవారిని 84,258 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,502 మంది భక్తులు తిరుమల వెంకన్నకు తల నీలాలు సమర్పించారు. సోమవారం తిరుమలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.90 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు.

తిరుమల సమాచారం

తిరుమలలో రెండో రోజు శ్రీవారి జ్యేష్ఠాభిషేకం, నేడు ముత్యపు కవచంతో స్వామి దర్శనమివ్వనున్నారు. అమ్మవారు, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు, నేడు గజ వాహన సేవ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తెప్పోత్సవాల కారణంగా తిరుచానూరు అమ్మవారి ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవను టీటీడీ రద్దు చేసినట్లు తెలిపింది.