17 April, 2026 | 3:17 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

నేటి బాలలే రేపటి దేశ నిర్మాతలు

26-02-2026 12:45 AM

గిన్నిస్ రికార్డ్ హోల్డర్ పెండెం కృష్ణ కుమార్

నూతనకల్, ఫిబ్రవరి 25: నేటి బాలబాలికలే భవిష్యత్తులో దేశాభివృద్ధికి మూలస్తంభాలని, ప్రతి విద్యార్థి తమ బాధ్యతను గుర్తించి దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఫోర్ టైమ్స్ గిన్నిస్ వరల్ రికార్డ్ హోల్డర్ పెండెం కృష్ణ కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని పెదినిమిల ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు, స్వాతంత్య్ర సమరయోధుల చిత్రపటాలు, భారతదేశం మరియు తెలంగాణ రాష్ట్ర మ్యాపులను ఆయన పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. పిల్లల్లోని సృజనాత్మకతను వెలికి తీయడానికి జాతీయ నాయకులు, శాస్త్రవేత్తల జీవిత చరిత్రల గురించి అవగాహన కలిగి ఉండటం ఎంతో అవసరమని పేర్కొన్నారు.విద్యార్థులు ఇష్టంతో విజ్ఞానాన్ని నేర్చుకోవాలి. ఉన్నత పదవులను అధిరోహించి, సమాజానికి సేవ చేసే స్థాయికి ఎదగాలన్నారు. చదువుతో పాటు క్రీడలు కూడా శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి. నీరజ, ఉపాధ్యాయులు వై. చంద్రశేఖర్ రెడ్డి, బి. కెనడి, ఎన్. రజిత, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.