15 May, 2026 | 8:15 PM

Breaking News

పరీక్ష కేంద్రం వద్ద చల్లటి నీరు, అంబలి పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్ బొడ్డు స్పందన గంగన్న   •   జవహర్ నవోదయ పాఠశాలకు భూమి స్వాధీనం.. రైతులతో చర్చించి సరిహద్దుల ఖరారు   •   ఫిర్యాదుదారుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి   •   మలిదశ ఉద్యమకారుల ముందస్తు అరెస్ట్   •   ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో ప్రత్యేక సమావేశం   •   ఉపాధి హామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం మార్చడం సిగ్గుచేటు   •   దొంగలు... బాబోయ్... దొంగలు...   •   చెంచుల జీవనోపాధికి టీజీఐఎల్పీ కీలకం   •   మోడీది డబుల్ ఇంజన్ సర్కార్ కాదు.. రెండు నాలుకల సర్కార్   •   మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సోమయ్య   •  

ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం

09-12-2025 07:48 PM

నంగునూరు: నంగునూరు ఉన్నత పాఠశాలలో మంగళవారం గ్రామ పంచాయతీ ఎన్నికల విధులు నిర్వహించే ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మహబూబ్ అలీ మాట్లాడుతూ.. అధికారులు ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మాస్టర్ ట్రైనర్లు మధుసూదన్ రెడ్డి, బాలరాజ్, రాంభూపాల్ రెడ్డిలు ఓటింగ్ విధానం, కౌంటింగ్, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు అవగాహన కల్పించారు. ఎన్నికల ప్రక్రియను సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకమని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి తగిరెడ్డి దేశిరెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.