4 July, 2026 | 10:36 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

‘పరివాహన్ సారథి’లోకి రవాణా శాఖ

01-05-2025 02:01 AM

పోర్టల్‌ను ప్రారంభించిన మంత్రి పొన్నం

హైదరాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): తెలంగాణలో రవాణా శాఖ సేవలు పరివాహన్ సారథిలోకి బుధవారం లాంఛనంగా అడు గుపెట్టింది. తిరుమలగిరి ఆర్టీవో కార్యాలయంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సారథి పోర్టల్‌ను ప్రారంభించారు. తెలంగాణ రవాణా శాఖ ఇకపై ఫెడరల్ సిస్టంలో కేంద్రంతో కలిసి సమన్వయంతో నడుస్తుందని పేర్కొన్నారు.

అనంతరం ఆధునీకరించిన తిరుమలగిరి ఆర్టీవో కార్యా లయాన్ని కూ డా ప్రారంభించారు. ఈ సందర్భం గా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. దేశంలో పరివాహన్ సారధి అనే పోర్టల్ ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. రోడ్డు నిబంధనలు పాటించకపోతే లైసెన్సులు రద్దు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎంపీ అనిల్ కుమా ర్ యాదవ్, ఎమ్మెల్యే శ్రీగణేష్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, కంటోన్మెంట్ సీఈవో తదితరులు పాల్గొన్నారు.