01-05-2025 02:01:40 AM
కేంద్ర మంత్రి బండి సంజయ్
హైదరాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా జనాభా లెక్కలతో పాటు కుల గణన నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సాహసోపేతమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు తెలిపారు.
అత్యంత శాస్త్రీయంగా కేంద్రం నిర్వహించే కులగణనతో కులాల వారీగా ఎంత జనాభా ఉందనేది నిక్కచ్చిగా తేలుతుందన్నారు. తద్వారా ఏ కులానికి నష్టం వాటిల్లకుండా రిజర్వేషన్ల అమలులో న్యాయం జరిగే అవకాశముందన్నారు.
మోదీ ప్రభుత్వం తీసుకు న్న నిర్ణయం కాంగ్రెస్ విజయమంటూ ఆ పార్టీ నేతలు ప్రచారం చేసుకోవడం సిగ్గు చేటన్నారు. కాంగ్రెస్ కుల గణనకు వ్యతిరేకి అని, స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఏనాడూ కులగణన చేయలేదన్నారు.