calender_icon.png 18 November, 2025 | 6:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హలో ఆదివాసి ఛలో ఉట్నూర్ జయప్రదం చేయాలి

18-11-2025 04:50:35 PM

ఆదివాసీ మండల అధ్యక్షులు కోరెత తిరుపతి

బెజ్జూర్ (విజయక్రాంతి): కొమురం భీం జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలోని ఆదివాసి భవనంలో ఆదివాసీల ధర్మ యుద్ధం పోస్టర్లను ఆదివాసి నాయకులు ఆవిష్కరించారు. అనంతరం ఆదివాసి మండల అధ్యక్షులు కోరిత తిరుపతి మాట్లాడుతూ ఆదివాసి బచావో లంబాడా హటావో అనే ప్రధాన నినాదంతో ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించాలని ఏకైక డిమాండ్ తో ఈనెల నవంబర్ 23వ తేదీన ఉట్నూర్ మండల కేంద్రంలో ఎంపీడీవో గ్రౌండ్ లో ధర్మ యుద్ధం పేరిట భారీ బహిరంగ సభను 9 తెగల ఆదివాసీ సంఘాల సమన్వయ కమిటీ అధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది అని వారు తెలియజేస్తూ ఉట్నూర్ మహా సభను విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు సిడం సాకారం, వ్యవస్థాపక అధ్యక్షులు కుర్సింగా ఓం ప్రకాష్, సర్మెడి కొడప శంకర్, కొలవార్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆత్రం బక్కయ, కోయ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మెస్రం రాజారాం, ఆదివాసీ మహిళ అధ్యక్షరాలు ఎనుకా అమృత, జిల్లా యువజన సంఘం అధ్యక్షులు మెడి సతీష్, ప్రచార కార్యదర్శి సడ్మేక రమేష్, మాజీ సర్పచులు కొమురం హన్మంతు, కర్పేత రమేష్, కొలవార్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల శ్యామ్ రావు, కొలవార్ మండల ఉపాధ్యక్షులు మనేపెళ్లి మల్లేష్, ఆదివాసీ నాయకులు కోరేత లలయ్య, ఆత్రం గంగారాం, ఆత్రం రాజారాం, పురుషోత్తం, నైతం సత్తయ్య, పేదం శ్రీహరి, ఏనుక శ్రీహరి, గెడం నందరం, కొడిపె వెంకటేష్, తోరెం వినోద్, సిడం షణ్ముఖ, జిల్లా సహాయక కార్యదర్శి పోల్కా వెంకటేష్, గవుడే గణేష్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.