09-01-2026 09:17:26 PM
నిజామాబాద్,(విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లాలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ లుగా, వార్డు సభ్యులుగా గెలుపొందిన మున్నూరుకావు సామజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించుకుంటామని జిల్లా మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు ధర్మపురి సంజయ్ అన్నారు. శుక్రవారం అయన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సంజయ్ మాట్లాడుతూ... నూతనంగా ఎన్నికైన మున్నూరుకాపు ప్రజాప్రతినిధులను ఈ నెల 11 వ తేదీన ఆర్ ఆర్ చౌరస్తా నుండి భారీ ర్యాలీగా తీసుకువచ్చి శివాజినగర్ లోని శంకర్ భవన్ పాఠశాలలో ఘనంగా సన్మానించడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమానికి జిల్లాలోని మున్నూరుకాపు కులస్థులు పెద్దఎత్తున హాజరుకావాలని కోరారు. ఈ సన్మాన కార్యక్రమం ద్వారా మున్నూరు కాపుల ఐక్యతను చాటు కోవడం జరుగుతుందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఆకుల చిన్న రాజేశ్వర్, ఆది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.