calender_icon.png 14 June, 2025 | 4:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్షయ వ్యాధి స్క్రీనింగ్ పరీక్షలు పెంచాలి

14-06-2025 12:49:03 AM

స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్ 

నల్లగొండ టౌన్ జూన్13( విజయక్రాంతి): క్షయ వ్యాధి స్క్రీనింగ్ పరీక్షలు పెంచాలని స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్ అన్నారు.శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన “ జిల్లా టిబి ఫోరం” సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2025- 26 నాటికి జిల్లాలో టి బి లేకుండా చూడాలని అన్నారు. ఇందులో భాగంగా టిబి పరీక్షలను వేగవంతం చేయడం, గుర్తించిన వారికి సరైన విధంగా చికిత్స అందించడం, గుర్తించిన ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాలలో సైతం ఎలాంటి ఇబ్బందులు లేకుండా టి బి పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. జిల్లాలో క్షయ వ్యాధిని నియంత్రించడంలో స్వచ్ఛంద సంస్థలు పూర్తిగా సహకరించాలని కోరారు. 

టి బి నియంత్రణలో భాగంగాకేంద్ర ప్రభుత్వం టీబి సోకిన వారికి నెలకు వెయ్యి రూపాయలు చొప్పున ఇస్తున్నదని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.అంతకుముందు జిల్లా  క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ కళ్యాణ చక్రవర్తి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 10 మిలియన్ల మంది క్షయ వ్యాధికి గురవుతున్నారని, భారతదేశంలో 27 నుండి 29 లక్షలు, తెలంగాణలో 60 నుండి 70 వేల మంది, నల్గొండ జిల్లాలో మూడు వేల మంది నమోదవుతుందగా  ఈ సంవత్సరం ఇది 2200  కు  తగ్గిందని తెలిపారు. 

టి బి సోకిన వారిని త్వరగా గుర్తించడంతో పాటు ,సరైన విధంగా చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, టి బి సోకిన వ్యక్తుల కుటుంబాలకు పరీక్షలు నిర్వహిస్తున్నామని, డిసెంబర్ 2025 నాటికి పూర్తిగా టిబిని  నిర్మూలించే దిశగా కృషి చేయడం జరుగుతున్నదని, గత నెల 26 నుండి టి బి నివారణ ప్రచారాన్ని  తీవ్రతరం చేసే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని, ఇందులో భాగంగా 67 శిబిరాలను నిర్వహించి, 13 వేల మందికి పరీక్షలు నిర్వహించడం జరిగిందని తెలిపారు.ఈ సమావేశంలో  డిప్యూటీ డిఎంహెచ్ ఓ వేణుగోపాల్ రెడ్డి, ఆర్డిఓ వై అశోక్ రెడ్డి, ఇంచార్జి జిల్లా పరిషత్ సీఈవో శ్రీనివాసరావు, వరల్డ్ ఆరోగ్య సంస్థ ప్రతినిధి   బ్లేస్సి ఎస్తర్, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు,తదితరులు హాజరయ్యారు.