గోండుగూడెం సందర్శించిన తుడుం దెబ్బ రాష్ట్ర నాయకులు
22-06-2026 06:14 PM
ఖానాపూర్,(విజయక్రాంతి): కడెం మండలంలోని నచ్చని ఎల్లాపూర్ గోండుగూడ ఆదివాసీ కుటుంబాలకు న్యాయం చేయాలని తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు సందర్శించారు. ఇటీవలి నెలకొన్న భూ వివాదం నేపథ్యంలో సోమవారం గ్రామాన్ని సందర్శించారు. రాష్ట్ర అధ్యక్షులు జి గణేష్ కార్యదర్శి మనోజ్ ఆదివాసి సమస్యలను జిల్లా కలెక్టర్కు అధికారులకు విన్నవించి సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఈ సమస్యపై వెంటనే స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త అజయ్ మురళి సంఘ నాయకులు రాజేశ్వర్ గౌడ్ శేషారావు దేవ్ పటేల్ తదితరులు ఉన్నారు.






