1 April, 2026 | 2:37 AM

మానుకోట జిల్లాలో ఇద్దరు సీఐల బదిలీ

01-04-2026 12:00 AM

మహబూబాబాద్, మార్చి 31 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో ఇద్దరు సిఐలు బదిలీ అయ్యారు. గూడూరు సీఐ గా కొత్తగా వినయ్ కుమార్ నియమితులయ్యారు. అలాగే మహబూబాబాద్ రూరల్ సీఐ గా అంజలి నియమితులయ్యారు. ఇక్కడ పనిచేసిన సీఐలు సూర్యప్రకాష్, సర్వయ్యను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయవలసిందిగా మల్టీ జోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశించారు.