calender_icon.png 30 May, 2025 | 5:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు.. ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు

28-05-2025 06:26:48 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తాండూరులో ఎల్ఆర్ఎస్ నిబంధనలకు విరుద్ధంగా భారీగా ఓపెన్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. 200 ఓపెన్ ప్లాట్లు నిబంధనలకు వ్యతిరేకంగా రిజిస్ట్రేషన్ జరిగినట్లు అధికారులు ప్రాథమిక విచారణలో నిర్థారణ అయినట్లు సమాచారం. ఫిబ్రవరి 21 నుంచి ఎల్ఆర్ఎస్ కింద రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయని, 2020 ఆగస్టు 26కు ముందు 10 శాతం రిజిస్టేషన్లు జరిగిన లేఔట్లకే ఎల్ఆర్ఎస్ వర్తిస్తుందని అధికారులు వెల్లడించారు. తాండూరులో నిబంధనలు ఉల్లంఘించి అధికారులు ఎల్ఆర్ఎస్ వర్తింపజేశారు. ఓపెన్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ల డాక్యుమెంట్లను స్కానింగ్ చేయకుండా ప్కన పెట్టిన అధికారాలు ఫసియుద్ధీన్, సుధాపవన్ పై సస్పెన్షన్ వేటు పడింది. వీరిపై ఆడిట్ విభాగంతో విచారణ కొనసాగుతంది.