09-06-2025 06:04:39 PM
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం శ్రీకారం చుట్టిన 100 రోజుల ప్రణాళిక కార్యక్రమం నిరాటంకంగా సాగుతుంది. అందులో భాగంగా పురపాలక సంఘంలో ప్రతి వార్డులో తడి-పొడి చెత్త వేరు చేసే కార్యక్రమంపై బస్తీ వాసులకు అవగాహన కార్యక్రమం సాగుతోంది. 4 వార్డు బెల్లంపల్లి బస్తీలో తడి -పొడి చెత్త వేరు చేయడంపై మహిళలకి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మునిసిపల్ కమిషనర్ శ్రీనివాస రావు, ఎన్విరాల్ మెంట్ ఇంజనీర్ సంతోష్, టీఎంసీ దుర్గయ్య, సి ఓ కిషోర్, మెప్మా సిబ్బంది, ఆర్పీలు సుజాత, మహిళలు పాల్గొన్నారు.