02-09-2025 12:09:50 AM
మహబూబ్నగర్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): యూరియా కోసం రైతులు ఆందోళన చింత కూడదని,వివిధ మండలాల నుంచి జిల్లా కేంద్రానికి యూరియా కోసం వచ్చే రైతులందరూ పట్టాదారు పాస్ బుక్ లను ఆధార్ కార్డులను తీసుకొని అవసరమా యూరియా అందుబాటులో ఉంచేందుకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని మహబూబ్ నగర్ వ్యవసాయ సహాయ సంచాలకులు బి.రామ్ పాల్, మండల వ్యవసాయ అధికారి అర్బన్ పి.శ్రీనివాసులు ఒక సంయుక్త ప్రకటనలో తెలియజేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వారుపేర్కొన్నారు.