2 July, 2026 | 11:35 AM

Breaking News

తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •  

అల్ఫోర్స్ నరేందర్‌రెడ్డికి వెంకట్

26-05-2025 01:16 AM

ఫౌండేషన్ వై.రఘునాథం ఎక్సలెన్స్ అవార్డు

కరీంనగర్, మే 25 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర విద్యారంగంలో అత్యుత్తమ ఫలితాలను సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నందుకుఅల్ఫోర్స్  విద్యాసంస్థల అధినేత, విఎన్‌ఆర్  ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా.వి. నరేందర్ రెడ్డికి వెంకట్ ఫౌండేషన్ వై రఘునాథం ఎక్స్లెన్స్ అవార్డును ప్రధానం చేసింది. 

గర శివారులోని ప్రైవేటు వేడుక మందిరంలో  నిర్వహించిన కార్యక్రమంలో సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ, వెంకట్ ఫౌండేషన్ ఫౌండర్, చైర్మన్ గంప వెంకట్  చేతులమీదుగా అవార్డును ప్రధానం చేశారు. ఈ సందర్భంగా అల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ అవార్డు రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఈ అవార్డు బాధ్యత మరింత రెట్టింపు చేసిందన్నారు.

వార్డు రావడానికి కృషి చేస్తున్న సిబ్బందికి, ప్రోత్సాహాన్ని అందిస్తున్న తల్లిదండ్రులకు అంకితమిస్తున్నానని, సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.