బంగారం తూకంలో మోసాలు పోలీసులకు బాధితుడు ఫిర్యాదు
14-07-2026 01:30 AM
తాండూరు జూలై13, (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని కొందరు బంగారు ఆభరణాల దుకాణల యజమానులు తూకాల్లో మోసాలకు పాల్పడడంతో కొనుగోలుదారులు లబో దిబో అంటున్నారు. తరచుగా తాండూరు లో బంగారం షాప్ ల వారిది లొల్లి లొల్లి నడుస్తుంది .
తాజాగా తాండూరు టౌన్ కు చెందిన టిప్పు అలీ అనే వ్యక్తి తన కుటుంబం తో కలిసి ఇటీవలనే పవన్, మహాలక్ష్మి, జీ పీ జూలర్స్. షాప్ లలో బంగారు ఆభరణా లు కొనుగోలు చేయగా 24 క్యారెట్స్ ధర నిర్ణయించి జిఎస్టి బిల్లు లేకుండా సాధారణ తెల్ల కాగితంపై బిల్లు ఇచ్చారు. కొన్ని రోజుల తర్వాత తన అవసరం కోసం విక్రయిం చేందుకు వెళ్లగా అక్కడి దుకాణ యజమా నులు టెస్టింగ్ చేయగా 20 క్యారెట్ల బంగా రం ఉందని చెప్పడంతో మోసపోయానని గ్రహించి తనకు న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.






