23 June, 2026 | 2:42 PM

Breaking News

ప్రభుత్వ పాఠశాలల మూసివేతను ఆపండి: ఏబీవీపీ డిమాండ్   •   సీసీ రోడ్డుకి భూమి పూజ   •   సహకార సంఘం ఆధ్వర్యంలో గోదాముల నిర్మాణం చేపట్టాలి   •   భూక్యారెడ్డితండాలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ కింద ఎక్స్‌రే పరీక్షలు   •   ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తా: నియోజకవర్గం ఇన్చార్జి   •   రైతులు విత్తనాల మేళాను సద్వినియోగం చేసుకోవాలి   •   యూరియా కోసం రైతుల ధర్నా.. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే అరెస్ట్   •   పోతారంలో చిన్న వానకే చెరువులా ప్రధాన రహదారి   •   ఏసీబీకి చిక్కిన నిజామాబాద్ ఎక్సైజ్ సూపరిండెంట్   •   శ్యామా ప్రసాద్ ముఖర్జీ త్యాగం ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకం   •  

‘అధికార పార్టీ కొమ్ముకాస్తున్న సీఐ’ సస్పెండ్ చేయాలంటూ జనగామలో బాధితుల ధర్నా

15-06-2024 12:05 AM

జనగామ, జూన్ 14(విజయక్రాంతి): జనగామ సీఐ అధికార పార్టీకి కొమ్ము కాస్తూ సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఓ కుటుంబం ఆరోపించింది. పోలీసుల తీరును నిరసిస్తూ జనగామ ఆర్టీసీ చౌరస్తాలో కుటుంబ సభ్యులు ధర్నా నిర్వహించారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి చెందిన బీజేపీ నాయకుడు ఈర్ల అనిల్‌కుమార్ మాట్లాడుతూ.. కొన్ని రోజుల క్రితం తమ కుటుంబంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు దాడికి పాల్పడ్డారని చెప్పారు.

దాడితో తన సోదరుడి భుజం ఎముక విరిగిందని, తన తల్లి దుస్తులు చింపి మరీ దాడి చేశారని ఆవేదన చెందారు. ఈ విషయంలో నిందితులను సీఐ కాపాడే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తమపై హత్యాయత్నం చేసిన వారిని చిన్నపాటి సెక్షన్లు విధించి వదిలేశారని, తిరిగి తమపైనే ఎస్‌టీ అట్రాసిటీ కేసు పెడతామని బెదిరిస్తున్నారని వాపోయారు. నిందితుల వంత పాడుతున్న సీఐను వెంటనే సస్పెండ్ చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని సీపీని డిమాండ్ చేశారు.