12-06-2025 06:36:20 PM
గంగరేని కుంట సందర్శించిన రెవెన్యూ అధికారులు..
సర్వే చేసి హద్దులు పెడతాం..
హుజురాబాద్ (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా(Karimnagar District) హుజురాబాద్ పట్టణ శివారులోని రంగనాయకుల గుట్ట సమీపంలో గంగారేణి కుంటను రెవెన్యూ అధికారులు గురువారం పరిశీలించారు. విజయక్రాంతి పేపర్లో అధికారులు స్పందించరు అనే శీర్షిక కథనానికి స్పందించిన తాసిల్దార్ కనకయ్య(Tahsildar Kanakaiah) అధికారులను పంపి సర్వే చేయించారు. కబ్జా చేసిన వారిని పూర్తి సర్వే చేసే వరకు నాట్లు వేయవద్దని సూచించారు. సుమారుగా 11 గుంటలు కబ్జా గురైనట్లు అంచనా వేస్తున్నారు. హద్దులు ఏర్పాటు చేసి కబ్జా కాకుండా చూస్తామని తహసిల్దార్ కనకయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ శేఖర్, సర్వేయర్ వంశీ, వీఆర్ఏ రోహిత్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.