22-11-2025 03:24:38 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): గ్రామ పరిపాలన ఉద్యోగుల ఆవిర్భావ సభకు తరలిరావాలని గ్రామ పరిపాలన ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ చిరంజీవి కోరారు. శనివారం కామారెడ్డిలో ఆయన మాట్లాడుతూ... గ్రామ పరిపాలన అధికారుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికై ఈనెల 23న హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గ్రామ పరిపాలన ఉద్యోగ అసోసియేషన్ నూతన ఆవిర్భావ సభను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ చిరంజీవి ముదిరాజ్ కోరారు.
జీపిఓ ఉద్యోగుల హక్కులను, ఆత్మగౌరాన్ని కాపాడుకోవడానికి ఈ సభలో చర్చించడం జరుగుతుందన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉద్యోగుల ఐక్యతను చేర్చి మహాశక్తిగా ఎదిగేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ ఆవిర్భావ సభకు ముఖ్య అతిథులుగా రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వి. లచ్చిరెడ్డి, డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ లు హాజరవుతారన్నారు. ఈ సభకు రాష్ట్ర నలుమూలల నుండి జిపీఓలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.