4 May, 2026 | 12:27 PM

Breaking News

22వ వార్డులో డ్రైనేజ్ సమస్యకు పరిష్కారం.. నూతన నిర్మాణ పనులు ప్రారంభం   •   సేంద్రియ పద్ధతి ద్వారా అధిక దిగుబడి   •   తిరుపతి జిల్లాలో ఘోరప్ర‌మాదం: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన‌ అంబులెన్స్.. నలుగురు మృతి   •   37 వ డివిజన్ అభివృద్ధికి సహకరించండి   •   కొడుకు సాయంతో ప్రియుడిని హత్య చేసిన వివాహిత   •   Tamil Nadu Election Results 2026: తమిళనాడులో విజయ్ TVK ప్రభంజనం   •   Assam Election Results 2026: అస్సాంలో BJP ముందంజ   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, పలువురు ప్రముఖులు   •   తిరుమలాయపాలెంలో ‘రైతువారం’ – అవగాహన సదస్సులకు ఏఓ పిలుపు   •   సాయం చేద్దామని వెళ్తే.. ఎనిమిది మంది ప్రాణాలు పోయాయి..!   •  

ప్రశాంతంగా గ్రామపాలన అధికారుల పరీక్ష..

25-05-2025 06:12 PM

పరీక్షకు 35 మంది గైర్హాజరు..

జిల్లా కలెక్టర్ త్రిపాఠి..

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున కళాశాలలో నిర్వహించిన గ్రామ పాలన అధికారుల పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పరీక్ష ప్రారంభమైన వెంటనే జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి(District Collector Ila Tripathi), ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్(In-charge Additional Collector Narayan Amit) కలిసి గ్రామ పాలనాధికారుల పరీక్షను తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటిండెంట్ ఇన్విజిలేటర్లతో పరీక్ష తీరు తెన్నులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా పరీక్షకు హాజరైన వారు, గైర్హాజరైన వారి వివరాలను, పరీక్షా కేంద్రంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలు, బందోబస్తు, తదితర అన్ని అంశాలను పరిశీలించారు.

కాగా నల్గొండ జిల్లా నుండి గ్రామ పాలన అధికారుల పరీక్షకు 276 మంది హాజరు కావలసి ఉండగా 241 మంది పరీక్షకు హాజరయ్యారు. 35 మంది పరీక్షకు గైర్హాజరైనట్లు కలెక్టర్ తెలిపారు. గ్రామ పాలనాధికారుల పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని ఆమె తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంట ఇన్చార్జి రెవెన్యూ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, స్థానిక సంస్థల ఇన్చార్జ్ అధనపు కలెక్టర్, గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్, తహసిల్దార్ హరిబాబు, తదితరులు ఉన్నారు.