3 April, 2026 | 2:52 AM

కేంద్ర నిధులతోనే గ్రామాల అభివృద్ధి

03-04-2026 01:15 AM

బీజేపీ నేత మహేశ్వర్‌రెడ్డి 

నిర్మల్ ఏప్రిల్ 2 (విజయక్రాంతి): సబ్కా సాత్.. సబ్కా వికాస్ అనే నినాదంతో దేశ ప్రధాని నరేంద్ర మోడీ పల్లీల అభివృద్ధికి మంజూరు చేస్తున్న నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్న అని నిర్మల్ ఎమ్మెల్యే బీజేఎల్పి నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం సారంగాపూర్ మండలంలోని కౌట్ల కుట్టి ఇప్పచెల్లమే రాజిక్ తాండ పొట్టి దుబ్బ తండా నాగపూర్ రవీందర్ నగర్ తండా తదితర గ్రామపంచాయతీలో సుమారు ఐదు కోట్లతో చేపట్టి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు.

కమ్యూనిటీ భవనాలు పాఠశాల ప్రహరీ గోడలు అంగన్వాడీ బిల్డింగ్ లు అంతర్గత రోడ్లు పూర్తిచేరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షులు చంద్రకాంత్ నాయకులు రావుల రామనాథ్ పార్టీ అధ్యక్షులు నరేష్ ఆయా గ్రామాల సర్పంచులు బిజెపి నాయకులు పాల్గొన్నారు.