16-01-2026 11:37:25 AM
పాల్గొన్న ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్
విజయక్రాంతి,పాపన్నపేట: మండల పరిధిలోని లక్ష్మీనగర్ గ్రామంలో ప్రతి ఏటా సంక్రాంతికి గ్రామస్తులు గ్రామం పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ సారి కూడా గ్రామానికి 78వ పుట్టినరోజు వేడుక గురువారం ఘనంగా నిర్వహించారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ విచ్చేసి ముందుగా గ్రామంలోని రామాలయంలో నిర్వహించిన పూజల్లో పాల్గొన్న అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో కేక్ కోసి గ్రామ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని, లక్ష్మీనగర్ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. మండల నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.