కోహ్లీ సింగిల్ డిజిట్ స్కోర్.. 8 ఏళ్లలో ఇదే తొలిసారి
06-06-2024 05:39 PM
న్యూయార్క్లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన టీ20 ప్రపంచకప్లో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో ఐర్లాండ్పై సునాయాసంగా విజయం సాధించింది. 97 పరుగుల ఛేదనలో రోహిత్ శర్మ మెరుపు హాఫ్ సెంచరీ సాధించగా, రిషబ్ పంత్ కూడా అంతకు ముందు బౌలింగ్ యూనిట్ పర్ఫెక్ట్ వర్క్ చేయడంతో చెలరేగిపోయాడు. అయితే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ప్రభావం చూపలేకపోయాడు. ఐదు బాల్స్ ఆడిన విరాట్ సింగిల్ డిజిట్ స్కోర్ చేసి క్యాచ్ అవుట్ అయ్యాడు. టీ 20 వరల్డ్ కప్ లో మంచి ట్రాక్ రికార్డు ఉన్న కోహ్లీ ఛేజింగ్ లో 50 లోపు పరుగులకు ఔట్ అవ్వడం ఎనిమిది ఏళ్లలో ఇదే మొదటి సారి.






