28 June, 2026 | 3:07 PM

Breaking News

రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •  

ఓటర్ మ్యాపింగ్ వేగంగా పూర్తి చేయాలి

31-01-2026 09:55 PM

నిర్మల్,(విజయక్రాంతి): ఓటరు ప్రోజెని మ్యాపింగ్ ప్రక్రియలో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, శనివారం సాయంత్రం, కలెక్టరేట్ లోని వీసీ హాలు నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి, అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ, ఓటరు ప్రోజెని మ్యాపింగ్ ప్రక్రియలో వేగం పెంచాలని ఆదేశించారు.

2002 వివరాలతో, ప్రస్తుత వివరాలు సరి పోల్చి మ్యాపింగ్ ప్రక్రియను తర్వాతగతిన పూర్తి చేయాలని అన్నారు. బూత్ స్థాయి అధికారులు (బిఎల్ఓ లు) తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో వెళ్లి ప్రక్రియను చేపట్టాలని తెలిపారు. బిఎల్ఓ లు రోజువారీగా చేపట్టి  ప్రోజెని మ్యాపింగ్ వివరాలను తమకు అందిస్తూ ఉండాలని పేర్కొన్నారు. బిఎల్ఓ లకు ప్రోజెని మ్యాపింగ్ ప్రక్రియ నిర్వహణలో ఎబిఎల్ఓ లు సహకారం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఎక్కడైనా పోలింగ్ బూత్ లలో ఈ ప్రక్రియలో ఇబ్బందులు ఎదురైతే సంబంధిత బూత్ లకు చెందిన బిఎల్ఓలు అందరూ సమన్వయం చేసుకుంటే ఇబ్బందులు తొలగుతాయని చెప్పారు. నిర్ణిత గడువులోగా ఈ ప్రోజెని మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్నకళ్యాణి, నిర్మల్, ఖానాపూర్ మున్సిపల్ కమిషనర్ లు జగదీశ్వర్ గౌడ్, సుందర్ సింగ్, తహసిల్దార్ లు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.