calender_icon.png 26 June, 2025 | 11:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజాయితీగా ఆలయ అభివృద్ధికి కృషి చేయాలి

26-06-2025 07:53:42 PM

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ..

కామారెడ్డి (విజయక్రాంతి): నిజాయితీగా నూతనంగా ఎన్నికైన ఆలయ పాలకవర్గ సభ్యులు ఆలయాభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ(State Government Advisor Shabbir Ali) అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలోని వీర హనుమాన్, వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ ప్రతినిధుల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. స్వామివారికి సేవ చేసుకునే అవకాశం కలిగింది కలవడం గొప్ప విషయం అని అన్నారు. స్వామి వారి కర్ణతోనే నీకు ఈ పదవులు వచ్చాయని దాన్ని అభివృద్ధితో చూపించాలన్నారు. చాలా పురాతనమైన వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి ఆలయాలు ఎంతో మహిమగలవని అన్నారు.

భక్తులు ఎక్కువగా వచ్చే విధంగా ఆలయ కమిటీ ప్రతి నిధులు కృషి చేయాలన్నారు. ఆలయ దర్శనం చేసుకుంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుందన్నారు. ఆలయ అభివృద్ధికి తన వంతుగా ఛాయ శక్తుల  కృషి చేస్తానని అన్నారు. ఆలయ నూతన కమిటీ చైర్మన్గా శని శెట్టి రాజమౌళి, డైరెక్టర్గా రాజేష్, భూక్య శాంతి, సత్యనారాయణ, దేవయ్య, లతో ప్రమాణ స్వీకారం ఆలయ ఈ ఓ ప్రభు,ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి విష్ణునాథన్, జైరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షట్కార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, టిపిసిసి ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగరావు, మండల పార్టీ అధ్యక్షులు పల్లె రమేష్ గౌడ్, నౌసిలాల్, గూడెం శ్రీనివాస్ రెడ్డి, నరసింహారెడ్డి, సదర్ నాయక్, గణేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. 

ముఖ్య అతిథులుగా ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్, ఏఐసీసీ సెక్రెటరీ విష్ణు నాథన్ జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షట్కర్, మాచారెడ్డి మండల కేంద్రంలోనీ శ్రీ వీర హనుమాన్  వెంకటేశ్వర స్వామి దేవాలయ కమిటీ నూతన చైర్మన్ పాలకవర్గ సభ్యులతో  షబ్బీర్అలీ గారి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీ వీరహనుమాన్  వెంకటేశ్వర స్వామి  ఆలయ కమిటీ  చైర్మన్ గా శేణిశెట్టి రాజమౌళి, డైరెక్టర్లుగా రాజేశం, భుక్య శాంతి సత్యనారాయణ, దేవయ్యతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాలు మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ... వీరహనుమాన్ వెంకటేశ్వర స్వామి ఆలయం చాలా పురాతనమైనది, మహిమలు గలదని అన్నారు.

 నాకు ఆలయ అభివృద్ధి చేసే అవకాశం కల్పించిన స్వామివారు ఆలయ కమిటీ సభ్యులు నిజాయితీగా స్వామి వారి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని మీకు ఈ అవకాశం దొరకడం చాలా గొప్ప విషయమని స్వామి వారి కరుణతోనే మీకు ఈ పదవులు వచ్చాయని దాన్ని అభివృద్ధితో సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కోరికలు కోరుకున్న వారికి కోరికలు నెరవేరుతాయని ఆలయ దర్శనం చేసుకుంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుందని అన్నారు. ఆలయ అభివృద్ధికి నా వంతు శాయశక్తుల కృషి చేస్తాను అన్నారు.