21-05-2025 04:57:09 PM
ఎమ్మెల్సీ శంకర్ నాయక్..
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): పార్టీ శ్రేణులంతా రాజీవ్ గాంధీ ఆశయ సాధన కోసం కృషి చేయాలని ఎమ్మెల్సీ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ నాయక్(District Congress President Shankar Naik) పిలుపునిచ్చారు. భారత మాజీ ప్రధాని దివంగత నేత రాజీవ్ గాంధీ వర్ధంతిని బుధవారం నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డు వీటి కాలనీలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.