29-10-2025 12:32:25 AM
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నర్సయ్య
బోథ్, అక్టోబర్ 28 (విజయక్రాంతి) : ఆదిలాబాద్ నేరడిగొండ మండల కేంద్రం లోని గ్రంథాలయాన్ని మంగళవారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్స య్య సందర్శించారు. ఈ సందర్భంగా గ్రం థాలయం లోని రిజిస్టర్లను పరిశీలించారు. రోజు ఎంత మంది వస్తున్నారని, బుక్స్ అందుబాటులో ఉన్నాయా లేదా అని వాకా బు చేశారు.
ఈ సందర్బంగా చైర్మన్ మాట్లాడుతూ నిరుద్యోగులు పోటీ పరీక్షలు ప్రిపేర్ అవడానికి ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తామని, ఇక్కడే చదువుకునే ఏర్పాట్లు చేస్తామన్నారు. గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అనంతరం ఆయనకు గ్రంథాలయ సిబ్బం ది, నాయకులు శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో బోథ్ వ్యవసాయ మార్కె ట్ కమిటీ ఛైర్మన్ బొడ్డు గంగా రెడ్డి, ఉపాధ్యక్షుడు ఆడే వసంత్ రావు, రాజశేఖర్ రెడ్డి, సంజీవ్, అశోక్, రమేష్, సద్దాం, లైబ్రరీయ న్ శ్రీకాంత్, గ్రంథాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.