24 August, 2026 | 10:18 PM

Breaking News

మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •   ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్వర్ స్కాలర్‌షిప్   •   ఒంటరి మహిళల సర్టిఫికెట్లకు తిప్పలు!   •   సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   గణేష్ మాండపాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని వినతి   •   చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్   •   యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి   •   పోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్టకు ఆహ్వానం   •   ప్రభుత్వ ఆసుపత్రి డైట్ క్యాంటీన్ ను తనిఖీ చేసిన ఆహార భద్రతా అధికారి జి వరుణ్ రెడ్డి   •  

చేయూత పెన్షన్స్‌లో సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తాం

31-07-2025 12:59 AM

జనగామ, జులై 30 (విజయ క్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులు నిర్మాణాలను మొదలు పెట్టాలి.. మున్సిపల్ కార్య కలాపాలు విస్తృత పరచాలి. బుధవారం అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)పింకేష్ కుమార్ స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీలో పర్యటించి చేయూత పెన్షన్స్ లో  సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు చేపడుతున్న ముఖచిత్రంతో గుర్తింపు కార్యక్రమా న్ని స్వయంగా పరిశీలించారు.

అనంతరం ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులు తో సమావేశం నిర్వహించి మున్సిపల్ కార్యకలా పాలను సమీక్షించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులు ఇండ్ల నిర్మాణాలు వెంటనే చేపట్టాలన్నారు.లబ్దిదారులు మహిళా సంఘాల లో సభ్యులను ఇండ్ల నిర్మాణాలు చేపట్టే విధంగా ప్రోత్సహించాలన్నారు. చేయూత ఫెన్షన్ లబ్దిదారులు ఆందోళన చెందరాదన్నారు. పెన్షన్లలోని వస్తున్న సాంకేతిక సమ స్యలను తప్పనిసరిగా పరిష్కరిస్తామన్నారు.

మున్సిపల్ ఆదాయం పెంచేందుకు ప్రణాళిక పరంగా ముందుకు వెళ్లాలన్నారు. పారి శుద్ధ్య పనులు చేపడుతూ సీజనల్ వ్యాధులు సోకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమి షనర్ రాధాకృష్ణ, హౌసింగ్ ఇంజనీరింగ్ అధికారులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులు, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.