7 July, 2026 | 7:33 PM

Breaking News

డిగ్రీ ప్రవేశాల్లో రాష్ట్రంలో ప్రథమ స్థానం   •   ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసిన వివిధ గ్రామ సర్పంచులు   •   గట్టుదుద్దెనపల్లి సంఘం చైర్మన్ గా గంగుల రామ్ రెడ్డి   •   సర్ ప్రక్రియపై ఓటర్లకు అవగాహన కార్యక్రమం   •   నాగిరెడ్డిపేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీల సంఖ్య పెంచాలి   •   17వ వార్షికోత్సవ వేడుకలకు ముస్తాబైన సుల్తానాబాద్ సాయిబాబా దేవాలయం   •   ఘనంగా ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   అనగారిన వర్గాల... అభ్యున్నతి ఎమ్మార్పీఎస్ తోనే సాధ్యం   •   ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   ఇందిరమ్మ ఇండ్ల వద్ద కరెంటు స్తంభాలు ఏర్పాటు   •  

సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో కీలక పరిణామం

04-08-2025 09:11 AM

హైదరాబాద్: యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్(Universal Creation Fertility Center) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐవీఎఫ్ చికిత్స కు వచ్చిన వారిని సరోగసి పేరిట మోసం చేసి డబ్బులు తీసుకున్నారని ఫిర్యాదు నమోదైంది. బాధితుల ఫిర్యాదు మేరకు గోపాలపురం పోలీసులు(Gopalapuram Police) నాలుగు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. తమకు అందించిన మెడికల్ రిపోర్టులు తీసుకొచ్చి బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు. నల్గొండకు చెందిన దంపతుల నుంచి డాక్టర్ నమ్రత రూ. 44 లక్షలు కాజేసినట్లు ఆరోపణలున్నాయి. బాధితుల ఫిర్యాదుతో నమ్రత, సదానందం, చెన్నారావు, అర్చన, సురేఖపై కేసు నమోదు చేశారు.

హైదరాబాద్ కు చెందిన బాధితుల ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదైంది. కళ్యాణి గ్యాంగ్ కొన్ని రోజుల తర్వాత విశాఖ పిలిచి స్పెర్మ్ తీసుకుని పంపినట్లు తెలుస్తోంది. సరోగసి పేరుతో రూ. 18 లక్షలు తీసుకుని మోసం చేశారని మహిళ ఫిర్యాదులో పేర్కొంది. నమ్రత, డా. విద్యులత, కల్యాణి, శేషగిరి, శ్రీనివాస్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఎన్ఆర్ఐలను కూడా నమ్రత గ్యాంగ్ మోసం చేసినట్లు ఫిర్యాదు అందుతున్నాయి. బాధితుల నుంచి నమ్రత రూ. 25 లక్షలు కాజేసింది. బాధితుడి ఫిర్యాదుతో నమ్రతపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ కు చెందిన బాధితుల నుంచి నమ్రత గ్యాంగ్ రూ. 50 లక్షలు కాజేసింది. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో రోజు రోజుకు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయని పోలీసులు తెలిపారు.