04-08-2025 08:55:49 AM
హైదరాబాద్: ఖమ్మం(Khammam) జిల్లా చింతకాని మండలం నాగులవంచలో విషాదం చోటుచేసుకుంది. నిన్న రెడ్డి చెరువులో(Reddy Cheruvu) చేపల వేటకు వెళ్లి ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు. చెరువులో మునిగి నాగేశ్వరరావు(62), సత్యం(58) మృత్యువాత పడ్డారు. ఇవాళ చెరువులోంచి మృతదేహాలను పోలీసులు వెలికి తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.