1 July, 2026 | 7:49 PM

Breaking News

బోనమెత్తిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు   •   ఎర్రుపాలెం ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన ఎం.శారద   •   కంచర్లలో తాగునీటి సమస్యకు పరిష్కారం   •   శ్రీ ఉమామహేశ్వరంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రత్యేక పూజలు   •   విజయ క్రాంతి వార్తకు స్పందన మొలకెత్తని సోయాబీన్ పొలాలను పరిశీలించిన అధికారులు   •   డిబిఎమ్ 6 కాల్వకు గండి   •   ఓస్ట్‌ఫాలియా యూనివర్సిటీతో శాతవాహన అవగాహన ఒప్పందం   •   సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పి తనిఖీ   •   అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం   •   ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •  

బాధిత రైతులను ఆదుకుంటాం

04-05-2025 12:37 AM

వడగళ్ల వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

కడ్తాల్, మే 3 :  అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు పరిహార అందజేసి రైతుల ను ఆదుకుంటామని  ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి హామీని ఇచ్చారు. శనివారం కడ్తాల  మండలంలోని ఏక్వాయిపల్లి, మర్రిపల్లి గ్రామాల్లో అకాల వర్షాలు వడగండ్ల వాన కు దెబ్బతిన్న వరి పంటల ను వ్యవసాయ అధికారి శ్రీలత తో కలిసి ఏమ్మెల్యే  పరిశీలించారు.

బాధిత రైతుల తో ఎమ్మెల్యే మాట్లాడి  ఎంత వరి పంట సాగు చేశారు తదిత వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం  ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటల వివరాలను ఆయన సేకరించాలని అధికారులను ఆయ న ఆదేశించారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతు లకు నష్టం జరిగితే ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందన్నారు.

బాధిత రైతులు ఎవరు ఆందోళన చెందోద్దని  నష్టపోయిన పంటల కు పరిహారం అందిం చి ఆదుకుంటామని  ఆయన భరోసా కల్పించారు. కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి,  ఏవో శ్రీలత, మాజీ జెడ్పిటిసి  శ్రీనివాస్ రెడ్డి, సింగిల్ విండో మాజీ చైర్మన్  శ్రీనివాస్ గౌడ్,మాజీ ఎంపీటీసీ  పాలకూర్ల ఉమా వతి,శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు యాట నర్సింహా,  బీక్యా నాయక్, బీచ్యా నాయక్, కర్ణాకర్ గౌడ్, సుమన్, రైతులు పాల్గొన్నారు.