24-05-2025 12:00:00 AM
-కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
ఖైరతాబాద్, మే 23 (విజయక్రాంతి) : తెలంగాణ లో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని,ఆంధ్రప్రదేశ్ లో గల సైనిక్ స్కూల్ లలో తెలంగాణ విద్యార్థులకు స్థానికత ను కల్పించాలని కోరుతూ సైనిక్ స్కూల్ తెలంగాణ విద్యార్థుల తరపున క్రాంతి కీన్ ఫౌండేషన్ సభ్యులు శుక్రవారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ను హైదరాబాద్ రాజ్ భవన్ రోడ్ లో గల దిల్ కుషా హౌస్ లో కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా క్రాంతి కీన్ ఫౌండేషన్ వారు మాట్లాడుతూ.. తాము విద్యార్థుల తరపున అందించిన వినతి పత్రాన్ని స్వీకరించి సానుకూలంగా స్పందించారని తెలిపారు. రాబో యే సంవత్సరం లోపు తెలంగాణ రాష్ట్రంలో సైనిక్ స్కూల్ ను ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. గతంలో కూడా కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ ను కూడా డిల్లీ వెళ్లి కలిశామని వారు కూడా స్పం దించి తెలంగాణ కు సైనిక్ స్కూల్ ఇచ్చే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు లను కూడా కలిసి వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. ముఖ్యంగా క్రాంతి కీన్ సంస్థలో చదువుతున్న 50 మంది విద్యార్థులు సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు, 300ల మార్కులకు గాను 291, 287, 287, 284, 281 మార్కులు సాధించిన విద్యార్థులు క్రాంతి కీన్ సంస్థ విద్యార్థులు కావడంతో కేంద్ర మంత్రి వారికి షీల్డులు బహుకరించి అభిందించారు.