01-02-2026 02:08:04 AM
గోడకు నోటీసులు అంటిస్తారా!
హైదరాబాద్, జనవరి 31 (విజయక్రాంతి): స్వయంగా కేసీఆర్ తానుంటున్న నివాసం అడ్రస్తో సహా పోలీసులకు రిప్లు ఇచ్చాక కూడా ఆయన లేని నివాసానికి రాత్రిపూట వచ్చి గోడకు నోటీసులు అంటించి పైశాచిక ఆనందం పొందడం దారుణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. కేసీఆర్కు రెండోసారి నోటీసును ఇస్తూ సిట్, నందినగర్లోని నివాసం గోడకు అతికించడంపై కేటీఆర్ స్పందించారు.
‘తెలంగాణ సాధకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఈ దుర్మార్గపు వైఖరి ఏంది రేవంత్ రెడ్డి?’ అని ప్రశ్నించారు. ఇది అహంకారం కాకపోతే మరేమిటి? అని నిలదీశారు. 65 ఏళ్లు దాటిన వ్యక్తులను వారుంటున్న నివాసం వద్దనే విచారించాలన్న రూల్ కూడా పోలీసులు అతిక్రమిస్తున్నారని మండిపడ్డారు.
‘అసలు మీ పోలీసులకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ మీద అవగాహన ఉందా? లేక మీచేతిలో కీలుబొమ్మల్లా ఇట్లా ప్రతిపక్ష నాయకులను వేధించడమే పనా? చట్టం మీద, న్యాయం మీద, ధర్మం మీద మీకు గౌరవం లేకపోవచ్చు, కానీ మాకు వాటిమీద పూర్తి విశ్వాసం ఉన్నది. ఈ అక్రమ కేసులన్నీ చేధిస్తాం.. మీ ప్రతి తప్పుడు పనిని వెలికితీసి తెలంగాణ ప్రజల ముందు పెడతాం. మీరెన్ని వేధింపులకు పాల్పడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా సమయం వచ్చినప్పుడు మీకు ప్రజాక్షేత్రంలోనే వారు బుద్ధిచెబుతారు’ అని కేటీఆర్ హెచ్చరించారు.