calender_icon.png 13 June, 2025 | 1:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చట్ట ఉల్లంఘనకు మద్దతు ఇవ్వను: సీఎం సిద్ధరామయ్య

11-06-2025 02:27:05 PM

కర్ణాటకకాంగ్రెస్ ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) సోదాలు నిర్వహించడంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Karnataka Chief Minister Siddaramaiah) బుధవారం వ్యాఖ్యానిస్తూ, తమ ప్రభుత్వం చట్ట ఉల్లంఘనకు మద్దతు ఇవ్వదని, చట్ట అమలుకు ఆటంకం కలిగించదని అన్నారు. వాల్మీకి కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా కాంగ్రెస్ బళ్లారి ఎంపీ ఇ. తుకారాం, ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలపై ఈడీ సోదాలు నిర్వహించిందని అధికారిక వర్గాలు తెలిపాయి.

"నేనేం చేయాలి? ఈడీ దాడులు నిర్వహించింది. చట్టప్రకారం వారు ఏమి చేయాలనుకుంటే అది చేయనివ్వండి. చట్టాన్ని ఉల్లంఘించడాన్ని మేము సమర్ధించము. చట్టం అమలుకు మేము అడ్డురాము. దానిని మేము అడ్డుకోము" అని సిద్ధరామయ్య ఒక ప్రశ్నకు సమాధానంగా అన్నారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) నిబంధనల కింద బళ్లారిలోని ఐదు స్థలాలు, బెంగళూరు నగరంలోని మూడు స్థలాలను సోదా చేస్తున్నట్లు ఈడీ తెలిపింది. వీటిలో తుకారాం,  ఎమ్మెల్యేలు నారా భరత్ రెడ్డి (బళ్లారి నగరం), జె.ఎన్. గణేష్ (కాంప్లి), ఎన్.టి. శ్రీనివాస్ (కుడ్లిగి)లకు చెందిన ఇళ్ళు ఉన్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో బళ్లారి నియోజకవర్గ ఓటర్లకు, కాంగ్రెస్ కార్యకర్తలకు నగదు పంపిణీ చేయడానికి, కర్ణాటక మహర్షి వాల్మీకి ఎస్టీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (కెఎంవిఎస్‌టిడిసి) ఖాతాల నుండి నిధులను స్వాహా చేశారనే ఆరోపణపై ఆధారాలు సేకరించేందుకు ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.