9 April, 2026 | 5:06 PM

Breaking News

దేశంలో భూపోరాటాలకు శ్రీకారం చుట్టిన మహోన్నత నేత సిఆర్   •   క్రమశిక్షణ ఉల్లంఘించిన అంగన్‌వాడీ టీచర్ స్వర్ణలత సస్పెండ్   •   ప్రవేట్ స్కూల్ బస్ డ్రైవర్ల సమస్యలు— పరిష్కరించాలని సీఐటీయూకి వినతిపత్రం   •   ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలను పొందేలా చర్యలు   •   ఎన్పిడిసిల్ ద్వారా 33/11 కేవీ సబ్ స్టేషన్ మంజూరు   •   దోమకొండలో జెండర్ అవగాహన శిక్షణ కార్యక్రమం విజయవంతం   •   యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్   •   “మా కాలనీ మీదుగా లైన్ వద్దు” — సింగరేణి తీరుపై ప్రజలు ఆగ్రహం   •   ఢిల్లీ అసెంబ్లీకి బాంబు బెదిరింపు — వేర్వేరు సమయాల్లో పేలుళ్లు అంటూ హెచ్చరిక   •   ఓటు వేసిన అస్సాం సీఎం — ఎన్‌డీఏ గెలుపుపై ధీమా   •  

అమలు కాని రాజగోపాల్ రెడ్డి మద్యం పాలసీ

23-01-2026 11:54 AM

ఉదయమే తెరుచుకున్న వైన్ షాపులు

రాష్ట్రం మొత్తం ఒకే నిబంధన ఉండాలన్న మందుబాబులు

సంస్థాన్ నారాయణపూర్,జనవరి 23 (విజయ క్రాంతి): మునుగోడు నియోజకవర్గంలో వైన్ షాపులు మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత తెరవాలని,సిట్టింగ్ సాయంత్రం 6 గంటల తర్వాత మొదలు పెట్టాలని సూచించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిబంధనలు అమలు కావడం లేదు. గురువారం కాంగ్రెస్ పార్టీ నాయకులు వైన్ షాపులను మూసివేసి మధ్యాహ్నం తర్వాతనే తెరవాలని సూచించారు. వైన్స్ సిబ్బంది అభ్యంతరం చెప్పినప్పటికీ బలవంతంగా మూసివేయించారు.రాజగోపాల్ రెడ్డి ఆదేశాలను తప్పకుండా పాటించాల్సిందే అని తేల్చి చెప్పారు.

కానీ శుక్రవారం ఎక్సైజ్ అధికారులు ఉదయమే వైన్స్ షాపులను,సిట్టింగులను తెరిపించారు.తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని మధ్యాహ్నం తర్వాత తెరవాలనే నిబంధన తమకు రాలేదని రాష్ట్రం మొత్తం ఒకే పాలసీ అమలులో ఉందని తెలిపారు.బలవంతంగా ఎవరైనా మద్యం షాపులను మూసివేయిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఒకే నిబంధన ఉండాలని మునుగోడు నియోజకవర్గానికి మాత్రమే ప్రత్యేక నిబంధనలు సరికాదని మద్యం ప్రియులు తెలిపారు.