తాగునీటి గోస తీర్చాలని ఆందోళన
మహబూబ్నగర్, మే 1 (విజయక్రాంతి): పాలమూరు మహిళలు తాగు నీటి కోసం రోడ్డెక్కారు. కొన్ని రోజులుగా నీరు రావడం లేదని పట్టణంలోని బోయపల్లికి చెందిన మహిళలు ఖాళీ బిందె లతో నిరసన తెలిపారు. మహిళలు రోడ్డుపై బైటాయించడంతో వాహనాలు భారీగా నిలిచిపోయా యి. విషయం తెలుసుకున్న మున్సిపల్ అధికారులు అక్కడికి చేరుకుని నీటి సరఫరాలో ఇబ్బందులు తొలగిస్తామని హామీఇచ్చారు. దీంతో మహిళలు ఆందోళనను విరమించారు.