గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

02-05-2024 01:52:06 AM

కార్యకర్తలకు బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ పిలుపు

మహబూబ్‌నగర్, మే 1 (విజయక్రాంతి): బీజేపీ కార్యకర్తలు లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ పిలుపునిచ్చారు. జడ్చర్ల, మహబూబ్‌నగర్ నియోజకవర్గాలకు చెందిన పలువురు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులు బుధవారం బీజేపీలో చేరారు. పార్టీలో చేరిన వారికి డీకే అరుణ ఆమె స్వగృహంలో కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కష్టపడి పనిచేసే వారికి మున్ముందు గుర్తింపు ఉంటుందన్నారు. కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలో కి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ నేతలు ధర్మానాయక్, సురేం దర్, బుచ్చన్న, మైబు పాల్గొన్నారు.