బొల్లారం పారిశ్రామికవాడలో రాణే కంపెనీలో కార్మికుడు మృతి
20-11-2025 10:34 PM
జిన్నారం: జిన్నారం మండలం బొల్లారం పారిశ్రామికవాడలోని రాణే కంపెనీలో ఓ కార్మికుడు మృతిచెందాడు. బీహార్ రాష్ట్రానికి చెందిన కృష్ణసింగ్(29) బొల్లారంలోని రాణే కంపెనీలో పనిచేస్తున్నాడు. గురువారం నాడు పైన రేకులు మార్చుతుండగా పక్కన ఉన్న వెంటిలేషన్ షీట్ నుండి కృష్ణసింగ్ కింద పడిపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. రాణే కంపెనీ యాజమాన్యం పని చేసే కార్మికునికి సేఫ్టీ బెల్ట్ ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే కార్మికుడు మృతిచెందాడని ఆరోపించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు.






