14-01-2026 01:53:33 AM
మంథని రైతులకు వ్యవసాయ యంత్రాల పంపిణీ
మంథని, జనవరి 13 (విజయక్రాంతి): తెలంగాణ రైతులకు యంత్ర లక్ష్మి పథకం ఎంతో మేలు చేస్తుందని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. సంక్రాంతి సం దర్భంగా యంత్ర లక్ష్మి పథకంలో భాగంగా మంథని సబ్ డివిజన్లోని మంథని, ముత్తా రం, రామగిరి, కమాన్పూర్ రైతులకు రూ. 58.38 లక్షల వ్యయంతో 703 యూనిట్లను సోమవారం రాత్రి మంత్రి శ్రీధర్బాబు అం దజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు వ్యవసాయ యాంత్రీ కరణలో భాగంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆద్వర్యంలో 10 ఏండ్ల తర్వాత ముఖ్యమం త్రి రేవంత్రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఆలోచనతో యంత్రాలను పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమం లో జిల్లా వ్యవసాయ అధికారి డీఏఓ బత్తిని శ్రీనివాస్, సహాయ సంచాలకులు అంజనీ మిశ్రా, మంథని, కమాన్పూర్, మంథని ఏ ఎంసీ చైర్మన్లు కుడుదుల వెంకన్న, వైనాల రాజు, టీజీఈఆర్సీ సలహ కమిటీ సభ్యులు శశిభూషణ్ కాచే, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అ ధ్యక్షుడు ముస్కుల సురేందర్రెడ్డి పాల్గొన్నారు.