calender_icon.png 21 June, 2025 | 11:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముందస్తుగా యోగాడే వేడుకలు

20-06-2025 12:00:00 AM

కరీంనగర్ క్రైం, జూన్ 19 (విజయ క్రాంతి): ఈ నెల 21న అంతర్జాతీయ యోగా డేను పురస్కరించుకొని బిజెపి పశ్చిమ జోన్ ఆధ్వర్యంలో విద్యానగర్లోని వెటర్నరీ పాలిటెక్నిక్ మైదానంలో గురువారం యోగ డే వేడుకలను ముందస్తుగా నిర్వహించారు. యోగా గురువు బొంగోని పరశురామ్ గౌడ్, జోన్ కన్వీనర్ జాడి బాల్ రెడ్డి, ప్రోగ్రాం కన్వీనర్ నరహరి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.

జాడి బాల్ రెడ్డి మాట్లాడుతూ 21 న అంబేద్కర్ స్టేడియంలో ప్రపంచ యోగా డే నిర్వహిస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరు హాజరుకావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ పాలిటెక్ని క్ కళాశాల మైదాన వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు హనుమాండ్ల రఘుపతి రెడ్డి, కార్యదర్శి కొండ రవీందర్,

పోరెడ్డి నరేందర్ రెడ్డి, సభ్యులునరహరి శ్రీనివాసరెడ్డి, శానగోం డ శ్రీనివాస్,గోదారి నరేష్, చంద్రగిరి వేణు, గంట్ల నరసింహారెడ్డి, బండ రాకేష్, ఈరెడ్డి తిరుమలరెడ్డి, సంజీవ్ కుమార్, ప్రతాప్ రెడ్డి, వరాల దేవేందర్, విష్ణు ప్రసాద్ రావు, వాకర్స్‌పాల్గొన్నారు.